జయసారది రెడ్డి గెలుపును కాంక్షిస్తూ వామపక్షాల నాయకుల ప్రచారం

Published: Saturday March 13, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని సంగెం గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బోడ సుదర్శన్, సిపిఎం మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, సిర్పంగి స్వామి లు మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు పట్టభద్రుడు నిరుద్యోగులను మోసం చేశారని, వారందరినీ ఓడించి వామపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయసారది రెడ్డికి మొదటి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పట్టభద్రుడు సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాడేవాడు కావాలి అన్నారు. శాసనమండలి సభ్యులు అధికార పార్టీ సభ్యులు 30 మంది ఉండి కూడా పట్టబద్రుల నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని, అందుకే పోరాడే వారికి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞపి చేశారు. ఈ ప్రచారంలో సీపీఐ మండల నాయకులు సల్వాద్రి రవీందర్, సిపిఎం శాఖ కార్యదర్శి బీమనబోయిన జంగయ్య, నాయకులు కిసరి దామోదర్ రెడ్డి, నారి రామస్వామి తదితరులుపాల్గొన్నారు