నర్సయ్య దశదినకర్మకు హాజరైన మల్లిబాబు యాదవ్
Published: Monday March 06, 2023
తల్లాడ(కారేపల్లి), మార్చి 5 (ప్రజా పాలన న్యూస్): పండితాపురం గ్రామంలో సీనియర్ జర్నలిస్టు రాయల బిక్షమయ్య తండ్రి రాయల నర్సయ్య ఇటీవలే మరణించారు. ఆదివారం వారి దశదినకర్మ కు హాజరై వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించిన కామేపల్లి మండల మాజీ జెడ్పిటిసి మేకల మల్లిబాబు యాదవ్. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, మాదిగ లంబాడి హక్కుల పోరాట సమితి కామేపల్లి మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు నాయక్, శ్యామ్ శరత్, బండి ఉపేందర్, లచ్చినర్స్ శ్రీను, వీరబాబు, వెంకటరాములు, శివ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Share this on your social network: