నర్సయ్య దశదినకర్మకు హాజరైన మల్లిబాబు యాదవ్

Published: Monday March 06, 2023

తల్లాడ(కారేపల్లి), మార్చి 5 (ప్రజా పాలన న్యూస్): పండితాపురం గ్రామంలో సీనియర్ జర్నలిస్టు రాయల బిక్షమయ్య  తండ్రి  రాయల నర్సయ్య  ఇటీవలే మరణించారు. ఆదివారం వారి దశదినకర్మ కు హాజరై వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించిన కామేపల్లి మండల మాజీ జెడ్పిటిసి మేకల మల్లిబాబు యాదవ్. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, మాదిగ లంబాడి హక్కుల పోరాట సమితి కామేపల్లి మండల అధ్యక్షులు  భూక్య నాగేంద్రబాబు నాయక్,   శ్యామ్ శరత్, బండి ఉపేందర్, లచ్చినర్స్ శ్రీను, వీరబాబు, వెంకటరాములు, శివ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.