పల్లె ప్రగతి కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీపీ

Published: Wednesday June 08, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (ప్రజా పాలన ప్రతినిధి)మండలం ఉట్లపల్లి గ్రామ పంచాయతీ, వేదంతపురం గ్రామ పంచాయతీ లో నిర్వహించే 5 వ రోజు పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగ ఈ రోజు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి పాల్గొని పల్లె ప్రగతి పనులను పరిశీలించి మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రతి పల్లె ప్రగతి పథంలో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఎంతో ఖర్చుతో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని,దీని వలన ప్రతి గ్రామం చాలా శుభ్రత తో పచ్చని మనిహరంలా ప్రతి గ్రామం మారుతుందని అయన తెలిపారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతులను  పిల్లలకు పెట్టే పౌష్ఠిక ఆహారం ను పరిశీలించిన అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి ,
అలాగే ఉట్లపల్లి గ్రామ పంచాయతీ లోని మన ఊరు మన బడి కార్యక్రమంలో సెలెక్ట్ ఐనా యంపీ పీయస్ పాఠశాలకు సుమారు 5.20 వేల రూపాయల నిధులను కేటాయించడంతో  అక్కడి పనులను ప్రారంభించటనికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన అశ్వారావుపేట ఎంపీపీ జలపల్లి శ్రీరామమూర్తి 
ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు సర్పంచ్ లు జ్యోత్స్న భాయ్,ప్రసాద్, టీఆర్ఎస్ పార్టి మండల అధ్యక్షులు బండి పుల్లారావు, పార్టి ప్రెసిడెంట్ కోడూరి నాగు, యంపీడిఓ విద్యాధర రావు,యంపీఓ సీత రామరాజు, సెక్రటరీ లు శ్యామ్, యాకూబ్ ఆలి తదితరులు పాల్గొన్నారు.