టూరిజం హాట్ స్పాట్ గా శివసాగర్ చెరువు : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Tuesday June 15, 2021
వికారాబాద్ జూన్ 14 ప్రజాపాలన బ్యూరో : మున్సిపాలిటీకి రాబడి ప్రణాలికను రూపొందిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శివసాగర్ (శివారెడ్డిపేట్) లో కొత్త హంగులతో పార్క్ మిని ట్యాంక్ బండ్ నిర్మాణ ప్రణాళిక కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో వికారాబాద్ శివసాగర్ చెరువును టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. పార్క్ నిర్మాణంలో వాటర్ ఫౌంటైన్, టాయ్ ట్రైన్, ఆంపి థియేటర్ మొదలయినవి నిర్మాణంలో భాగం చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో మునిసిపాలిటీకి ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపోదించాలన్నారు.పట్టణ ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నిర్ణయించిన గడువు లోపు పనులు పూర్తిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ భేగం, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, టియుఎఫ్ఐడిసి ఎస్ఈ రమణ మూర్తి, పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రభాకర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.