గల్ఫ్ అసోసియేషన్ భవన నిర్మాణం పనులు ప్రారంభించిన వైస్ ఎంపీపి.
Published: Saturday December 10, 2022
జన్నారం, నవంబర్ 09, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో గల్ఫ్ భవన నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని శుక్రవారం వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నవంబర్ 23 వ తేదీన మండలంలోని చింతగూడ గల్ఫ్ అసోసియేషన్ భవనానికి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్ గారి నిధుల నుండి మంజూరు చేసిన ఐదు లక్షల రూపాయలతో భవన నిర్మాణం భూమి పూజ చేశారని ఆయన తెలిపారు. గల్ఫ్ కార్మికులను టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు .ఈ కార్యక్రమంలో గల్ఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి, బిఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ బీర్పూర్ మల్లేష్, గల్ఫ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: