బూర్గంపహాడ్ మండలంలోని బిఆర్ఎస్ యూత్ కమిటీ సభ్యులు.. యువజన నాయకులకు కెసిఆర్ కప్ టోర్నమెంటు ర

Published: Friday January 06, 2023

 రాష్ట్ర ప్రభుత్వ విప్,, పినపాక శాసన సభ్యులు,, బిఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  ఆదేశాల మేరకు సంక్రాతి పండుగ సందర్బంగా మణుగూరులో నిర్వహిస్తున్నటువంటి "కెసిఆర్ కప్ టోర్నమెంట్ నకు.. మండలంలోని ప్రతీ గ్రామ పంచాయతీ నుండి వాలిబాల్ టీమ్ ఇవ్వగలరని మనవి..టోర్నీ నందు  పాల్గొన్న ప్రతీ టీమ్ నకు.. గౌరవ : శాసన సభ్యులు వాలీబాల్ కిట్టు ఇవ్వడం జరుగుతుంది.. కావున ప్రతీ గ్రామం నుండి టీమ్ ముందుకు రావాలని కోరుతూ.. మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలని బూర్గంపాడు యువజన నాయకుడు గోనెల నాని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని వారు అన్నారు.