గోలేటి డిస్పెన్సరీలోమినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.

Published: Saturday September 17, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి డిస్పెన్సరీలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, శుక్రవారం ఏరియా జిఎం దేవేందర్ కు వినతిపత్రం ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ డిస్పెన్సరీకి
వైద్యం కోసం వచ్చే ఉద్యోగులకు, పేషంట్లకు, త్రాగేందుకు మినరల్ వాటర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మినరల్ వాటర్ ప్లాంట్ ను యాజమాన్యం అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.
  ఈ సందర్భంగా స్పందించిన జనరల్ మేనేజర్  నెల రోజులలో  మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, వెంటనే సంబంధిత అధికారులను కూడా ఆదేశించడం జరిగిందని ఆయన తెలిపారు. 
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్  జి, దేవేందర్  కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు ప్రకాశరావు, మంత సమ్మయ్య, కుమారస్వామి, రాజేశం, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area