నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ మరియు కళ్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే,

Published: Monday September 19, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి): రూరల్ మండల వెల్దుర్తి, గొల్లపల్లె, వంజరిపల్లే, నరసింగా పూర్, అంతర్గం గ్రామాలలో 57 ఏండ్లు నిండిన వృద్ధులకు మరియు వికలాంగులకు, వితంతువులకు నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ల పంపిణీ మరియు కళ్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్  దావ వసంత సురేష్  అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ఎఎంసి ఛైర్మెన్ నక్కల రాధ, సర్పంచ్లు బుర్ర ప్రవీణ్ గౌడ్, ప్రకాష్, రజిత గంగారాం, సరోజన, బొనాగిరి నారాయణ, రైతు బంధు మండల కన్వినర్ నక్క రవీందర్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ లక్ష్మణ్, ఎంపీటీసీ లు మహేష్, శ్రీనివాస్, ఉప సర్పంచ్లు చీటీ రమ్యశ్రీ, ఎక్కల దేవి తిరుపతి, ప్రణవి, గ్రామశాఖ అధ్యక్షులు కొలగాని రామకృష్ణ, వెంకటేష్, తిరుపతి, గంగా రెడ్డి, స్వామి రెడ్డి ఎంపిడివో రాజేశ్వరి, ఎంపీవో రవి బాబు, వార్డ్ సభ్యులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆధికారులు, తదితరులు పాల్గొన్నారు.