అభివృద్ధి, సంక్షేమం లో దేశానికే తెలంగాణ ఆదర్శం జెడ్ పిచైర్మన్. లింగాల కమల్

Published: Saturday May 28, 2022

రాజు మధిర మే 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో శుక్రవారం నాడు పలు అభివృద్ధి పనులు గురించి మున్సిపాల్టీలో పర్యటన చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలంగాణసర్కారు లోనే మధిర  నియోజకవర్గ అభివృద్ధి.అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయండి.అభివృద్ధి, సంక్షేమం లో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం నాడు మధిర లో పర్యటించిన ఆయన మధిర లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా మడుపల్లి నుండి బయ్యారం మీదుగా మోటమర్రి వరుకు రూ.208 లక్షల రూపాయల తో జరుగుతున్న బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. అలానే మధిర శివాలయం వద్ద వైరా నది పక్కన భక్తుల సౌకర్యం కోసం నిర్మిస్తున్న స్థానాల ఘాట్ ను పరిశీలించారు. అనంతరం అక్కడ నుండి మధిర లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకొని అక్కడ రూ. 36 కోట్ల రూపాయల తో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో   మధిర నియోజకవర్గ అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అంతర్గత రోడ్ల నిర్మాణం, లింక్ రోడ్ల పునరుద్ధరణ తో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు మండల పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు  జీవి రెడ్డి నరేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అప్పారావు రమేష్ మేడికొండ కిరణ్ ఓంకార్ నాయకులు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు