భారత స్వాతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు

Published: Tuesday August 23, 2022

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 22 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని జిల్లాపరిషత్ హై స్కూల్ నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వరకు స్కూల్ పిల్లలతో 150 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ నేమూరి లత సత్యనారాయణ, ఎంపీటీసీ తిమ్మని రాములు,వార్డు సభ్యులు మరియు  డాక్టర్ వనజ,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్,  జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, కస్తూర్బా ప్రిన్సిపాల్, జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు, ఎంపీపీ ఎస్   ప్రధాన ఉపాధ్యాయుడు ఎంపీడీఓ ప్రభు, అంగన్వాడి టీచర్స్, ఆశా వర్కర్స్ యువజన నాయకులు యూత్ సభ్యులు మరియు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.