ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి *తొర్రూర్ రైతులకు ఇంటి స్థలం పట్టాలు అందజేసి

Published: Tuesday November 15, 2022

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రూర్ సర్వే నంబర్ 383/1 లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూములు కోల్పోయిన 100మంది దళిత రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి  హెచ్ఎండిఏ లేఅవుట్ లో  ప్రకారంగా అట్టి రైతులు భూమిని కోల్పోయిన సందర్భంలో ఒక్కో ఇంటికి  300గజాల ఇంటి స్థల పట్టాలను  ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  అందజేశారు.
కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి,అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో అనితా రెడ్డి, స్థానిక నాయకులు నల్లబోలు ప్రభువర్ధన్ రెడ్డి, మేకం యాదయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రైతులు కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి మరియు కేసీఆర్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.