పలు దేవాలయాల్లో పోటెత్తిన భక్తులు*

Published: Tuesday January 03, 2023
మధిర రూరల్ జనవరి 2 (ప్రజా పాలన ప్రతినిధి
) ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం పట్టణంలో పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు.  మధిర బంజర కాలనీ శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ వారి నిర్వహణలో ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఆలయ పూజారి అనంతచార్యులు ఆధ్వర్యంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహక కమిటీ బాధ్యులు గుండేల ముత్తయ్య, చల్లా శ్రీనివాస రెడ్డి, వీరారెడ్డి, తలపురెడ్డి నాగిరెడ్డి, కటకం నరసింహారావు, చీదిరాల సత్యనారాయణ,ఆవుల శ్రీనివాసరావు, కృష్ణ సూరి, తదితరులు పాల్గొన్నారు.