ఘనంగా గా అంబేద్కర్ చౌరస్తాలో బతుకమ్మ వేడుకలు

Published: Wednesday October 13, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం పట్టణ నడిబొడ్డులో బతుకమ్మ సంబరాలు అంగరంగవైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ కి చెందిన చైర్ పర్సన్ కప్పరి  స్రవంతి , వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఎంపీపీ  కృపేష్, ఎంపీడీవో మహేష్ బాబు, ఎమ్మార్వో అనిత తదితర  మున్సిపల్ కౌన్సిలర్లు ఇబ్రహీంపట్నం మండల వివిధ శాఖలకు చెందిన అధికారులు మరియు నాయకులు బతుకమ్మ సంబరాలలో  తలమునకలయ్యారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మ ను తయారుచేసిన తన వెంట తీసుకు వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పెట్టి తన ఆట పాటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం కు చెందిన ఆడపడుచులు, ఇబ్రహీంపట్నం చౌరస్తా లో యువతులు,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.