కేంద్ర ప్రభుత్వం నిధులు వాటి వివరాలు ఇవ్వాలి
Published: Wednesday September 21, 2022
పాలేరు సెప్టెంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జాతీయ కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు ఇంద్రసేనారెడ్డి గారి గొప్ప ఆలోచన మేరకు వారి ఆదేశానుసరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సమాచార హక్కు చట్టం కింద 2014 నుంచి 2020 వరకు కేంద్ర ప్రభుత్వం నిధుల వాటి వివరాల కోసం గ్రామపంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవోలను అగ్రికల్చర్ ఆఫీసర్లను సమాచారం కోసం దరఖాస్తులు ఇవ్వటం జరుగుతుంది
ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటాపురం గ్రామంలో ఈరోజు గ్రామ కార్యదర్శికి సమాచారం కోసం దరఖాస్తు ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ బూత్ అధ్యక్షుడు భాగం సతీష్ తూము భీష్మ ఏలూరి శ్రీను కార్యక్రమంలో పాల్గొన్నారు
Share this on your social network: