జి .ఎస్. ఆర్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్. రామకృష్ణాపూర్. నవంబర్ 8. ప్రజా పాలన.

Published: Wednesday November 09, 2022
జి ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ ను అక్కయ్య గుడిసెల సురేఖ రాజ్ జ్ఞాపకార్థం. మల్లంపేట గ్రామం, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లాలో నవంబర్ 11,12,13 తేదీలలో నిర్వహించబడును. అని జి. ఎస్. ఆర్ .ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు .డాక్టర్ రాజా రమేష్ బాబు తెలిపారు. కోటపల్లి గ్రామంలో టోర్నమెంట్ కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి ముందుగా ముఖ్య అతిథులుగా. జైపూర్ ఏ.సి.పి. గోపతి నరేందర్.ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ మల్లంపేట గ్రామంలోని వాలీబాల్ క్రీడాకారులు యువత కోరిక మేరకు వారిని ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత చదువుతోపాటు ఆటలపై ఆసక్తి పెంచుకోవాలని ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని, ఆటల తో పాటు జీవితంలో కూడా  ఓటమి గెలుపులను సమానంగా స్వీకరించి ముందుకు వెళ్ళాలని ఇలాంటి మారుమూల గ్రామంలో క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందంగా మరియు అదృష్టంగా భావిస్తున్నానని, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని వాలీబాల్ ప్లేయర్స్ అందరూ వచ్చి తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించి వాలీబాల్ టోర్నమెంట్ ని విజయవంతం చేయాలని కోరారు.
 ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్టుకి మొదటి బహుమతి 21,116/- రూపాయలు  రెండవ స్థానంలో నిలిచిన జట్టుకి 11,116/- రూపాయలు ప్రైజ్ మనీ  ఇస్తున్నట్లు తెలిపారు. ఈ యొక్క జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా జైపూర్ ఏ.సి.పి. గోపతి నరేందర్. అలాగే  కోటపల్లి సి.ఐ. విద్యాసాగర్ .చెన్నూర్ సి.ఐ. ప్రవీణ్.కోటపల్లి ఎస్సై వెంకట్ . జి.ఎస్. ఆర్. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కృష్ణమూర్తి. మల్లంపేట గ్రామ సర్పంచ్ అక్కల సుధాకర్. ఎంపీటీసీ చంద్రగిరి. శంకరయ్య .క్రీడా పోషకులు పొట్టు చిన్న రాంరెడ్డి.ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్ .
మల్లంపేట గ్రామ యువత జి. ఎస్. ఆర్. ఫౌండేషన్ సభ్యులు  వాలీబాల్ టోర్నమెంట్ ని నిర్వహిస్తారని వారికి అందరు సహకరించాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా రమేష్ బాబు. తో పాటు బద్రి సతీష్ .కిరణ్ కుమార్. సురేష్ బాబు .భాస్కర్, మల్లయ్య, విష్ణు, శ్రిషేలం, బానుచందర్ పాలుకొన్నరు.