ఘనంగా శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు

Published: Tuesday April 19, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 18 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ ప్రధాన రహదారిలో నెలకొన్న శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయ 4వ వార్షికోత్సవ వేడుకలు దేవాలయ కమిటీ చైర్మన్ బండారు వెంకట్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు  కొమిరి శెట్టి రమేష్, ప్రధాన కార్యదర్శి వాక నరసింహారావు, గండ్ల రవి, పన్నాల అర్జున్, గాదె శ్రీనివాస్, శ్రీకాంత్, నిశాంత్, రవీందర్ రెడ్డి, ఇల్లితం నరసింహారెడ్డి, నోముల శాంతికుమార్ తదితరులు  పాల్గొన్నారు.