ఘనంగా టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published: Wednesday March 30, 2022
మేడిపల్లి, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్ చౌరస్తాలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు పబ్బతి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జీ కోళ్ల రవి కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, కాసిమ్, ఇమామ్, సిద్ధయ్య, దండుగుల స్వామి, బి.రమేష్, చోటె మీయ, శరధ్ మరియు ఉప్పల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బజారు హేమంత్ గౌడ్, ఉపాధ్యక్షుడు మౌలాలి (ఎన్.బి.కె) తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: