అఖిల భారత యాదవ మహా సభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్లెత్తుల నరేష్ . ...... 2023 సంవత్సరం నూతన క్యాలె

Published: Friday January 20, 2023
అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్లెత్తుల నరేష్ యాదవ్ ను నియమించారు. ఈమేరకు
 ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ బుధవారం స్థానిక ఇందు గార్డెన్లో నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా
 బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా యాదవ సంఘం అభివృద్ధి కోసం నరేష్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడని జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న నరేష్ కు రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు  తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మల్లెత్తుల నరేష్ మాట్లాడుతూ తనపై  నమ్మకంతో  ఈ పదవిని ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షుడు బండి సధానందం తోపాటు రాష్ట్ర నాయకులకు, జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు. యాదవ సంఘం కోసం, యాదవ సంఘం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని, యాదవుల సమస్యపై ఎల్లప్పుడూ పోరాడుతూ అనునిత్యం అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ కు సంబంధించిన అపస్కృత సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడుతానని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం అఖిల భారత యాదవ సంఘం నూతన క్యాలెండర్ ను జిల్లా మండలాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు బొంతల మల్లేష్ యాదవ్ అల్లంల సత్తన్న యాదవ్ సందెన వేణి  సంజీవ్ యాదవ్ సత్ర వేణి మల్లేష్ యాదవ్ బోయిని మల్లేష్ యాదవ్ దార వేణి ప్రశాంత్ యాదవ్ దార వేణి సంతోష్ యాదవ్ నలిగేటి సాయి యాదవ్ బోయిని శంకర్ యాదవ్ సందన వేణి శంకర్ యాదవ్ కొమ్ము రాజన్న యాదవ్ కొమ్మ మహేష్ యాదవ్ రేష వేణి మహేష్ యాదవ్ సంధన వేణి నరేష్ యాదవ్ , జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మండలాల అధ్యక్షులు , నాయకులు పాల్గొన్నారు.