యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శికి సన్మానం

Published: Tuesday July 27, 2021

వలిగొండ ప్రజాపాలన మండల పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన వేలిమినేటి సురేష్ ఇటీవల యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా సోమవారం గాంధీభవన్ లో రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిలకు సురేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.