సీడ్ గణేష్ విగ్రహాలను బ్రాహ్మణులకు అందజేసిన టీఆర్ఎస్ నాయకులు నేర్థం భాస్కర్ గౌడ్
Published: Thursday September 09, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి) : ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఉప్పల్లోని స్థానిక బ్రాహ్మణులకు సీడ్ గణేష్ విగ్రహాలను టీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి నేర్థం భాస్కర్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ పచ్చదనం పరిరక్షణలో భాగంగా సీడ్ గణేష్ విగ్రహాలను వాడి నవరాత్రుల పూజ అనంతరం నిమజ్జనం చేసినట్లయితే తిరిగి మొక్కలు పెరిగి పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సీడ్ గణేష్ విగ్రహాలను వాడాలని విజ్ఞప్తి చేశారు.
Share this on your social network: