బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వీఆర్ఏ మద్దతుమధిర

Published: Tuesday July 26, 2022

జూలై రూరల్ 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడుతెలంగాణలో వి ఆర్ ఏ లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వారి డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు,  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక దీక్ష చేపట్టిన వి ఆర్ ఏ లుకు బిజెపి సంగిభావం తెలియజేసినది. వారి డిమాండ్స్ పేస్కెలు, ప్రమోషన్స్, వారసత్వ ఉద్యోగ కేటాయింపు జరగాలని, వెంటనే అమలు చెయ్యాలని,వి ఆర్ ఏ సమస్యలు పరిస్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బిజెపి డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో బిజెపి మధిర రూరల్ మండలం ఇంచార్జి రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు, బిజెపి నాయకులు కోనా నరసింహారావు, జివిఆర్,పట్టణ ఉపాధ్యక్షులు మాదిరాజు సాయిరామ్, మైనారిటీ మోర్చా గౌసిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరంభారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికై నేడు దేశ అత్యున్నత రాష్ట్రపతి పీఠన్ని స్వీకరించిన భారతమాత ముద్దుబిడ్డ మన గిరిజన మహిళ  శ్రీమతి ద్రౌపది ముర్ము కి శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయజనతాపార్టీ అర్బన్ రూరల్ కమిటీలు.దేశవ్యాప్తంగా వారి ఎన్నికతో సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో మధిరలో టపాసులు పేల్చి ద్రౌపతి ముర్ము గారికి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు, మండల ఇంచార్జి రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు, బిజెపి నాయకులు కోనా నరసింహారావు, జివిఆర్, పట్టణ ప్రధాన కార్యదర్శి పగడాల నాగేంద్రబాబు, ఉపాధ్యక్షులు మాదిరాజు సాయిరామ్, మైనారిటీ మోర్చా గౌసిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.