లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Published: Wednesday February 23, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేది 22 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెతుల మీదుగా మండలానికి చెందిన 117 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలకు టీఆర్‌ఎస్‌ సర్కారు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.సంక్షేమ పథకాల అమలులో ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదనీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా వంటి సంక్షోభంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపలేదనీ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రణాళికాబద్ధంగా తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు . ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహిపాల్, ఎంపీపీ కృపేష్, వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, తహశీల్దార్ కర్ర అనిత, ఇన్చార్జిగా ఎంపిడిఓ క్రాంతి కిరణ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీలు  ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.