నూతన దంపతులను ఆశీర్వదించిన బాధావత్ సైదులు నాయక్..

Published: Monday April 18, 2022
కొణిజర్ల, ఏప్రిల్ 17 (ప్రజాపాలన న్యూస్) : కొణిజర్ల మండలంలోని మేకాలకుంట గ్రామానికి చెందిన గుగులోతు సక్రు కుమారుడు రామారావు, సత్యవతి నిశ్చితార్థ వేడుక ఆదివారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు బాధావత్ సైదులు నాయక్ హాజరై నూతన దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, పిల్లాపాపలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సర్పంచ్ నరసింహారావు, ఎంపీటీసీ మదన్ లాల్, నాయకులు గుగులోతు బాలు, ధరావత్ మాన్సింగ్, గుగులోతు సంతూ తదితరులు పాల్గొన్నారు.