మండల అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం.

Published: Saturday June 26, 2021

బెల్లంపల్లి జూన్ 25 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల మండల అభివృద్ధి అధికారులతో శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన  బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాల వారీగా హరితహారం కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని, అలాగే ఎస్సీ కార్పొరేషన్ రుణాలను పూర్తి పారదర్శకంగా అర్హులకే అందచేయాలని అధికారులకు సూచించారు, ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీడీవో లతోపాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.