రోడ్డుకు మరమ్మతులు

Published: Wednesday October 13, 2021
బోనకల్, అక్టోబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం (ఏ) గ్రామంలో సర్పంచ్ బాగం శ్రీను వా‌సరావు అదర్వంలో ఎస్ సి స్మశాన వాటిక లో ఈ సంవత్సరం వర్షం వాల్ల నీటి గుంటలు పడడం వల్ల నీళ్ళు నిల్వ ఉండి స్మశాన వాటిక బురద మయంగా మారింది. సర్పంచ్ భాగం శ్రీనివాసరావు స్పందించి గుంటలను చదును చేసి జెసిబి ద్వారా కాలువ తీసి నీళ్లు చేరువు లోకి వేళ్ళు విధంగా కాలువ తియడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాగం శ్రీను వా‌సరావు, మరియు గ్రామ పంచాయితీ వర్కర్ దార సురేష్ తదితరులు పాల్గొన్నారు.