రంగారెడ్డి జిల్లా లో 7200 టీషర్ట్, క్యాప్ మరియు కండువా ఆవిష్కరణ

Published: Monday April 25, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం లోని దిల్షుఖ్ నగర్ లో 7000 మూవ్మెంట్ టీ షర్ట్స్, క్యాప్స్ మరియు కండువా ఆవిష్కరణ. కన్వీనర్ కృష్ణ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో తీన్మార్ మల్లన్న టీమ్ నీ ప్రతి మండలం, ప్రతి నియోజక వర్గంలో బలోపేతం చేస్తున్నాం అని.. ఎక్కడ అన్యాయం జరిగితే నిలదీసి అడిగే దమ్ము ధైర్యం ఒక్క తీన్మార్ మల్లన్న టీమ్ కి మాత్రమే ఉందన్నారు. 7200 నీ ప్రతి గడపకు తీసుకెళ్తామని, మే లో జరిగే 7200 బహిరంగ సభ కి ప్రతి ఒక్కరూ పాలుపంచు కోవలని అన్నారు. పేద ప్రజల కోసం తీన్మార్ మల్లన్న తన జీవితంనే పణంగా పెట్టారు అన్నతో పనిచేసే అవకాశం మనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అని అన్నారు. కో కన్వీనర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నిస్వార్ధంగా పనిచేసే టీమ్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క తీన్మార్ మల్లన్న టీమ్ మాత్రమే అని అన్నారు. మి మండలాలలో, మి ఊర్లో, మి నియోజక వర్గంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిచండి అవతలి వాడు ఎంత పెద్ద నాయకుడు అయిన సరే మీకు అండగా మేము ఉన్నాము అని తెలిపారు. అన్ని పార్టీలలో పైసలు ఉంటేనే గుర్తింపు ఉంటుంది అని కాని తీన్మార్ మల్లన్న టీమ్ లో ప్రశ్నించే వాడికి గుర్తింపు ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని నియోజక వర్గాల టీమ్ సభ్యులు, మల్లన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.