ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం : ఎంఇఒ వై ప్రభాకర్

Published: Friday November 26, 2021
మధిర నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని ఆత్కూర్ ప్రాథమికోన్నత పాఠశాల వేదికగా 2021-22 మాటూర్ పాఠశాలల సముదాయ సమావేశం శ్రీ దీవి సాయికృష్ణమా చార్యుల వారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మధిర మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలకు విచ్చేసినటు వంటి ఇతర పాఠశాలల విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తూవారు ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగేలా చూస్తూ పాఠశాలల బలోపేతానికి కృషి చేయవలసిందిగా ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సమావేశంలో ఆత్కూరు పాఠశాల ఉపాధ్యాయిని శ్రీమతి కళ్యాణి మాదిరి పాఠ్యాంశాన్ని బోధించడం జరిగింది. ఈ సమావేశంలో అసిస్టెంట్ సెక్రటరీ సంగు కృష్ణాంజనేయులు తోపాటు సముదాయ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.