అక్రమ నల్లమట్టిని అడ్డుకున్న యువజన కాంగ్రెస్

Published: Thursday May 19, 2022

ప్రజాపాలన ప్రతినిధి:నాగర్కర్నూల్ జిల్లా మంగనూరు గ్రామంలో చెరువు మట్టిని అక్రమంగా  తరలిస్తూ లక్షలు దండుకుంటున్న తెరాస నాయకులను ప్రశ్నించి వారిపై తిరగబడ్డ రైతులపై,  యువకులపై దాడి చేసి అక్రమ కేసులు బనాయించడం జరిగింది. విషయం తెలుసుకున్న నేషనల్ కాంగ్రెస్ యువజన ఇంఛార్జి అలవరు కృష్ణ గారు మరియు స్టేట్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జి   శివసేన రెడ్డిగారు పరామర్శించి వారిపై అక్రమ కేసులు కొట్టివేసి  దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారికి విన్నతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లింగాల మండల యూత్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ గారు,మండలం యూత్ వైస్ ప్రెసిడెంట్ కావేటి తరుణ్ గారు మరియు కాంగ్రెస్ యువకులు   పాల్గొన్నారు