నిందితుడిని కఠినంగా శిక్షించాలి

Published: Monday September 13, 2021

బోనకల్, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ళ చిన్నారి చైత్ర ను హత్యాచారం చేసి మృతికి కారకుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలి అంటూ బోనకల్ మండలం రావినూతల గ్రామం పడమర తండాలో బాలికల సంఘం మరియు ఐద్వా సంఘం ఆధ్వర్యంలో ఆరేళ్ళ చిన్నారి చైత్రను హత్యాచారం చేసి చిన్నారి మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని మరియు వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, బాలికల, మహిళల రక్షణ కై ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని రావినూతల గ్రామంలో ఆదివారం నాడు బాలికల సంఘం మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు గుగులోతు శారద, భానోత్ స్వప్న, బాలికల సంఘం నాయకురాలు గుగులోతు సంగీత, హాసిని, వేదశ్రీ, బానోతు యోగిత, శ్రావ్య, పల్లవి, శశిర,  హాసిని, తదితరులు పాల్గొన్నారు.