రోజుకు వెయ్యి కనీసం వ్యాక్సిన్ లు అందించాలి
Published: Saturday July 03, 2021
మధిర, జులై 02, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి ఒక్కరికి రోజుకు వెయ్యి కనీసం వ్యాక్సిన్ అందించాలి వ్యాక్సిన్ డోస్ 0.5ml బదులు 0.4ml ఇస్తున్నారన్న అపోహలను అధికారులు నివృత్తి చేయాలి ఓటిపి పద్ధతి రద్దు చేసి పాత విధానంలోనే వ్యాక్సిన్ అందించాలిసిపిఎం ఒకవైపు దేశంలో మూడవ ప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ ఉంటే ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే ఈ ప్రక్రియ వేగవంతం చేయాల్సింది పోయి పలురకాల షరతులతో రోజుకి కేవలం 100150 మాత్రమే వ్యాక్సిన్ అందించడం వల్ల ప్రజలందరికీ వ్యాక్సిన్ ఎప్పుడు అందుతుందని సిపిఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శులు శీలం నరసింహారావు మందా సైదులు అన్నారు. వెంటనే ప్రతి పీహెచ్సీ పరిధిలో రోజుకు వెయ్యి వ్యాక్సిన్లు అందించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ వేయించుకున్న ప్రజలు తమకు 0.5 ml ఇవ్వాల్సింది బదులు 0.4ml మాత్రమే ఇస్తున్నారని సందేహాలను తెలియజేస్తున్నానని అలాంటి సందేహాలను ప్రభుత్వ అధికారులు వెంటనే నివృత్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పడకండి మురళి మద్దాల ప్రభాకర్ తేలప్రోలు రాధాకృష్ణ వడ్రాణం మధు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: