ప్రమాదం అంచున కల్హేర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

Published: Thursday June 30, 2022
హైదరాబాద్  29 జూన్ ప్రజాపాలన: ప్రమాదం అంచున కల్హేర్ మండల కేంద్రం లో  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల .
సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కల్హేర్ మండల కేంద్రం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రవేశ ద్వారం పక్కనే విద్యుత్తు ట్రాన్స్ ఫారం ఆకు అలం ఇతర తీగల తో నిండుకొని  ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది. పాఠశాల ప్రవేశ ద్వారం పక్కనే విద్యుత్తు ట్రాన్స్ ఫారం ఈ విధంగా ఉండడం వల్ల విద్యార్థులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాకమిటి సభ్యులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం మొదలు అయినది. వర్షం కురిసినపుడు కరెంట్ స్తంభాలకు ట్రాన్స్ ఫారం కు ఉన్న ఆకులతో  కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంది. దీనితో 
విద్యార్థులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఎక్కువగా  ఉంది.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ప్రమాద ఘంటికలను గుర్తించి తగిన మరమ్మతులు చేయించాలని పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నారు