చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ను పూర్తి చేస్తాం కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు

Published: Friday May 07, 2021
మేడిపల్లి, మే 6 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ చిన్న చెరువు సుందరీకరణలో భాగంగా త్వరలో చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పూర్తిగా వేయించి పెన్సింగ్ చేయిస్తామని స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు తెలిపారు. ఈమేరకు కార్పొరేటర్ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించి చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ ను శుభ్రం చేయించారు. ప్రతిరోజు వాకింగ్ ట్రాక్ ను శుభ్ర పరిచి చెరువులో ఏలాంటి చెత్త, చెదారం వేయకుండా చూడాలని కార్పొరేటర్ జవాన్ మహేష్ కు ఎస్ఎఫ్ఐ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డివిజన్ అధ్యక్షులు బండారి వెంకటరావు, ప్రధాన కార్యదర్శి సంకూరీ కుమారస్వామి, గంగపుత్ర సంఘం ప్రతినిధి కాపర్తి మోహనకృష్ణ, గంగమ్మ టెంపుల్ అధ్యక్షుడు పూస సత్తయ్య, రేవు నరసింహ, సంతోష్ గుప్తా, తాళ్ల బాల కృష్ణ, శైలేందర్, నిశాంత్ పాల్గొన్నారు.