ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 22 ప్రజాపాలన ప్రతినిధి *టిడిపి భారీ బహిరంగ సభను విజయవంతం చేసినందు

Published: Friday December 23, 2022
ఇబ్రహీంపట్నం టిడిపి మున్సిపల్ అధ్యక్షుడు జక్కా రామ్ రెడ్డి
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో జరిగిన  భారీ బహిరంగ సభను  నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయమంతం చేసినందుకు ఇబ్రహీంపట్నం టిడిపి మున్సిపల్ అధ్యక్షుడు జక్క రామ్ రెడ్డి అందరికీ ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు నాయకులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో టిడిపి పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేసి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిస్తూ ఆయన తెలిపారు.