ఆలంపల్లి భూముల వేలం తాత్కాలికంగా రద్దు
Published: Monday November 14, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 13 నవంబర్ ప్రజా పాలన : ఈనెల 14న (సోమవారం) ఆర్డిఓ కార్యాలయంలో నిర్వహించ తలపెట్టిన రాజీవ్ స్వగృహ ఆలంపల్లిలో గల 15 ఎకరాల స్థలం వేలం పాటను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఆలంపల్లిలో గల 15 ఎకరాల స్థలంలో అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టవలసి ఉన్నందున ఇట్టి వేలం పాటను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. పనులు పూర్తయిన పిదప తదుపరి వేలం తేదీని నిర్ణయించి ప్రకటించడం జరుగుతుందని అన్నారు. అలాగే గంగారం లో గల 3.5 ఎకరాల స్థలానికి ప్రత్యక్ష వేలం యధావిధిగా సోమవారం ఉదయం 11:00 గంటలకు వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని, వేలం పాటలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Share this on your social network: