ఉప్పల్ ప్రెస్ క్లబ్ డైరీని ఆవిష్కరించిన కేటీఆర్
Published: Thursday February 25, 2021
మేడిపల్లి, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా డైరీని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహణ అధ్యక్షులు, మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, హైదరాబాద్ -రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవి, ఉప్పల్ ప్రెస్ క్లబ్ రిపోర్టర్లు పల్ల మహేందర్ రెడ్డి, మాదిరాజు సురేష్ కుమార్, వెంకట్రామ్ రెడ్డి, తిరుపతిరెడ్డి, నరోత్తం రెడ్డి, అమ్మిశెట్టిిిి వెంకటా శ్రీధర్ రావు, సాగర్, రాజు, దాసరాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: