డివిజన్ అభివృద్ధికి కృషి కార్పొరేటర్ సుభాష్ నాయక్

Published: Tuesday January 31, 2023
మేడిపల్లి, జనవరి 30 (ప్రజాపాలన ప్రతినిధి)

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్

2వ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని స్థానిక కార్పొరేటర్
  డాక్టర్ సుభాష్ నాయక్ పేర్కొన్నారు. కార్పొరేటర్ గా ఎన్నికై 3 సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంగా డివిజన్ ప్రజలు కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల బాలరాజు, ప్రధాన   కార్యదర్శి వరికల శ్రీనివాస్ మరియు సీనియర్ నాయకులు బండారి మల్లేష్, ధరణి కాలనీ అధ్యక్షులు పురుషోత్తం జనరల్ సెక్రటరీ లింగం, డాక్టర్ శ్రీనివాస్, తండా శ్రీనివాస్, ప్రకాష్ అన్న, సుకుమార్ రాజు రాథోడ్, ఉపేందర్ మరియు ధరణి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కాలనీవాసులు  తదితరులు పాల్గొన్నారు.