వెంకటరాములును పరామర్శించిన మల్లిబాబు యాదవ్..
Published: Saturday April 08, 2023
తల్లాడ(కామేపల్లి), ఏప్రిల్ 7 (ప్రజా పాలన న్యూస్):
ఇటీవల ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి, కిమ్స్ హాస్పిటల్ ఖమ్మం లో చికిత్స పొందుతున్న కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన పల్లె వెంకట్రాములు ను శుక్రవారం భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా అతనికి మనోధైర్యం కల్పించి, మేమున్నామంటూ భరోసా కల్పించారు. వైద్యులను సంప్రదించి వైద్యం గురించి ఆరా తీశారు. మెరుగైన చికిత్సను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ నాయకులు షేక్ ఫతే మహ్మద్, మడుగు సాంబమూర్తిరావూరి సతీష్, బోళ్ల సూర్యం , శేఖర్ పల్లె ఉపేందర్, నవీన్, కుటుంబ సభ్యులు ఉన్నారు.
Share this on your social network: