అమరవీరుల ఆశయాలకు కొనసాగిస్తాం

Published: Tuesday November 09, 2021
కొణిజర్ల: ప్రజాపాలన అమర వీరుల ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎంఎల్-న్యూడెమోక్రసీ) డివిజన్ నాయకుడు ఖాసీం పేర్కొన్నారు. మండల పరిధిలోని సింగరాపాలెంలో అమర వీరుల వర్థంతి సభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా తొలుత గ్రామంలో నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఖాసీం మాట్లాడుతూ అమర వీరుల ఆశయ సాధన కోసం వ్యవసాయక విప్లమే ఇరుసుగా దున్నే వానికే నినాదంతో భూ పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పైరవీలకం అవకాశం లేకుండా 2005 అటవీ చట్ట ప్రకారం ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించి అర్హులైన పోడుసాగు దారులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. పట్టాలిప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని పోడుసాగు దారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడి కొండలరావు, కంకణాల పెద్ద వెంకటి, తుడుం అనపణుసు, చిన్న వెంకటి తదితరులు పాల్గొన్నారు.