సుందరీకరణ గా మార్చడానికి మంత్రాల చెరువు ను సందర్శించిన మంత్రి
Published: Friday February 12, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; మహేశ్వరం నియోజక వర్గం శాసన సభ్యురాలు విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీర్ పేట్ యందు గల మంత్రాల చెరువును సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...... మంత్రాల చెరువును ప్రజలకు అందుబాటులో ఉండాలని అందుకు అవసరమగు వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కు, అన్ని సౌకర్యాలు సమకూర్చి చెరువును అభివృద్ది చేయాలని అధికారులకు సూచించారు. గతంలో మీర్ పేట్ కౌన్సిల్ సమావేశంలో మంత్రాల చెరువుకు బడ్జెట్ కేటాయించడం జరిగిందిని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ మేయర్ ముడావత్ దుర్గ దీప్ లాల్ చౌహన్, ఉప మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేషన్ కార్పోరేటర్లు మోడల బాలాకృష్ణ, యెడ్ల మల్లేష్, ధరమ్ కార్ జ్యోతి కిషోర్, మీర్ పేట్ కార్పొరేషన్ కమీషనర్ బి. సుమన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: