యాదవ మహాసభల్లో లాయర్ రామరాజు కు సన్మానం
Published: Monday November 08, 2021
మధిర 7తారీఖు ప్రజాపాలన ప్రతినిధి : హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర యాదవ న్యాయవాదుల లీగల్ సెల్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మధిర న్యాయవాది, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు, నాగవరప్పాడు మాజీ సర్పంచ్. ఈ సమావేశంలో మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీమంత్రి సి. కృష్ణా యాదవ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, హైకోర్టు జీ పి మరియు తెలంగాణ రాష్ట్ర యాదవ న్యాయవాదుల లీగల్ సెల్ అద్యక్షుడు శ్రీ చెలకాని వెంకట్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో న్యాయవాది రామరాజు చావలి ని వారు ఘనంగా సన్మానించారు.
Share this on your social network: