గణనాథులను దర్శించుకున్న మేయర్ యాదగిరి సునీల్ రావు.

Published: Thursday September 01, 2022
కరీంనగర్  ఆగస్టు ప్రజాపాలన 31:
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా కరీంనగర్ లోని 33 వ డివిజన్ భగత్ నగర్ కాంపు కార్యాలయం వద్ద గల భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండలాన్ని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించారు. వినాయక చతుర్థి పర్వదినం సందర్భంగా మొదటి రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి... మంగళ హారతి ఇచ్చారు. స్వామీ వారిని దర్శించుకొని... మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వినాయక పండు అర్చకులు మేయర్ యాదగిరి సునీల్ రావు కు వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.