తెనుగోళ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు

Published: Thursday January 13, 2022
మధిర జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో తెనుగోళ్ల సంక్షేమ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు తన స్వగ్రామం ఘనంగా నిర్వహించి వారి చిత్రపటాలు పూలమాలవేసి నివాళులర్పించారుఈ సందర్భంగా మాట్లాడుతూ యువత దేశాన్ని దేశంలో చైతన్యం నింపడానికి, ఆత్మ విశ్వాసం కలిగించడానికి తన జీవితమంతా కృషి చేసిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాము. ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, తెలుగు యువతకు శుభాకాంక్షలు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్నారు స్వామి వివేకానంద. కానీ రాష్ట్రంలో యువత అడుగడుగునా నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి ఉంది. జాబ్ కాలెండర్ రాదు. పరిశ్రమలు రావు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావు. స్వయం ఉపాధి రుణాలు మంజూరు కావు. విదేశీ విద్యకు సాయం లేదు.యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వానికి యువతరమే బుద్ధి చెప్పే రోజు త్వరలో రానుంది. అప్పుడు నిజమైన యువజనోత్సవాలను ఘనంగా చేసుకుందాం. అప్పటివరకు మార్పు కోసం కృషి చేద్దాం. తెనుగోళ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావుఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి తన ఇంట్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటేశ్వర రావు రాఘవ కోటేశ్వర లాయర్ సుబ్రహ్మణ్యం రమేష్ కోటేశ్వరావు. శ్రీను ఓంకార్ ఎర్ర నాగేశ్వరావు నాగార్జున ముఖేష్ ఈశ్వర్ రవితేజ పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు