కుమ్మరుల కుల వృత్తుల సంఘం నూతన కమిటీ ఏర్పాటు

Published: Friday June 17, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 16 ప్రజాపాలన ప్రతినిధి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో కుమ్మర సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎగిరి శెట్టి వీరయ్య ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుమ్మరుల కు  వృత్తుల  కోసం ప్రభుత్వం చేతి పనిముట్లను విద్యుత్ పరికరాలను అందజేసే విధంగా కృషి చేసిందని రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు అడాల గణేష్ ఆధ్వర్యంలో
రంగారెడ్డి జిల్లా కుల వృత్తుల అధ్యక్షుడు మోహన్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు  చేయడమైనది కమిటీ సభ్యులు కందుకూరు మండల కమిటీ ఎన్నికైన బొడ్డుపల్లి  రవి, కందుకూరు యూత్ అధ్యక్షుడు కుమ్మరి నరేష్, కందుకూర్ కుమ్మరి సంఘం ఎగిరి శెట్టి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. నా మీద నమ్మకంతో మండల  అధ్యక్షుడిగా పదవి కట్టబెట్టినందుకు నియమ నిబంధనలతో పని చేస్తానని కుమ్మరి సంఘం పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.