వైద్యులను సన్మానించిన మైత్రీ ఫౌండేషన్

Published: Friday July 02, 2021

గుమ్మడిదల, జులై 01, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలం లోని మైత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే నిర్వహించారు. గుమ్మడిదల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీధర్ మరియు పశువైద్యరాలు డాక్టర్ అరుణ లను శాలువాతో ఘనంగా సన్మానించి, మెమొంటో అందజేశారు. మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయకుమార్ మాట్లాడుతూ వైద్యో నారాయణో హరిః కరోనా విజృంభిస్తున్నప్పటికీ తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలందిస్తోన్న వైద్యులు దేవుళ్ళని, చేతులెత్తి వారిని మొక్కులని అయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది జయంతి, సావిత్రి, శోభారెడ్డి, మైత్రీ ఫౌండేషన్ సభ్యులు చిన్నపాపని రామా గౌడ్, విప్ప రామిరెడ్డి, దత్తు, నల్లవల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.