పట్టభద్రులకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హితోపాదేశం...

Published: Saturday March 13, 2021
జగిత్యాల,  మార్చి 12 (ప్రజాపాలన ప్రతినిధి) : మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హిమాయత్ నగర్ లో మీట్ మరియు గ్రీట్ కార్యక్రమంలో నాంపల్లి ఎన్నికల ఇంచార్జి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పట్టభద్రులకు హితోపదేశం చేశారు. పట్టభద్రులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆరెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవిని తప్పకుండ గెలిపించాలని పట్టభద్రులకు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ శ్రీ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.