అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖానాయక్

Published: Thursday November 24, 2022
జన్నారం, నవంబర్ 23, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే పరమవదిగా తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కుల సంఘాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర్ రేఖనాయక్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని చింతగూడ గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం భవనానికి మూడు లక్షల రూపాయలతో భూమి పూజ చేశారన్నారు. అనంతరం చింతగూడ ట్యాక్స్ ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. అదేవిధంగా చింతగూడెం గల్ఫ్ అసోసియేషన్ భవనానికి ఎమ్మెల్యే గారి నిధుల నుండి మంజూరు చేసిన ఐదు లక్షల రూపాయలతో భావన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మండలంలోని పలు గిరిజన గ్రామాలకు మంజూరైన దండారి చెక్కులను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతగూడ సర్పంచ్ ఆరి జ్యోతి శిరీష్ వైస్ ఎంపిపి సూతారి వినయ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, ఏఎంసీ వైస్ చైర్మన్ గొట్ల రాజేష్ యాదవ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జాడి గంగాధర్, మండల కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, చింతగూడ గ్రామ ముదిరాజ్ అధ్యక్షుడు నాగుల రాజన్న, జెట్టి లచ్చవ్వ, మిర్యాల అర్జున్, నాగుల రమేష్ ముదిరాజులు, నాయకులు భరత్ కుమార్, ఆనందం, తదితరులు పాల్గొన్నారు.