ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి

Published: Saturday October 29, 2022
బాధిత కుటుంబాని ప్రభుత్వం ఆదుకోవాలి
వైయస్సార్ టిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఇటికల సుగుణ రెడ్డి*

బాధిత కుటుంబానికి ప్రభుత్వము అన్నీ రకాలుగా ఆదుకోవాలని వైయస్సార్ టిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఇటికల సుగుణ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బుదవారం రాత్రి అంబోత్ తండా గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన బాలుడి కార్తీక్  కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  మునుగోడు ఎలక్షన్ సందర్భంగా బిఎంఆర్  ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చిన బస్సు తిరిగి వెళుతుండగా బస్సులో ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలు  మద్యం సేవించి  బస్సు డ్రైవరు  అదుపుతప్పి మంచాల గ్రామంలో అమృత్ తండాకు చెందిన  బాలుని ఢీకొని ఆ బాలుడు కార్తీక్ అక్కడిక్కడే మృతి చెందాడు ఆ బాలునికి కుంభానికి 20 లక్షల ఎక్స్ప్రెషన్ ప్రభుత్వం అందించాలని లేనియెడల ప్రభుత్వంపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాంఅని హెచ్చరించారు.