గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

Published: Monday June 21, 2021

జన్నారం, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని  మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు ఓ మా దేశంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర కమిటీ జన్నారం మండల కమిటీ తో మాట్లాడారు, అందుకుగాను మండల కమిటీ  చింతగూడ రాంపూర్ తిమ్మాపూర్ రోటి గూడ ధర్మారం బాదం పల్లి కవ్వాల్ కామన్ పల్లి ఫోన్ కాల్ murimadugu గ్రామాల కమిటీల సహాయంతో బాధిత కుటుంబానికి రూ 35000 ఆర్థిక సహాయాన్ని ఆదివారం  అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు పెరుగు మల్లికార్జున్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర కొండ తిరుపతి ఆ గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు, బాధితుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రూపాయలు ఐదు లక్షల ఎక్స్  గ్రేషియా చెల్లించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు