వ్యాక్సిన్ ఎక్కడ నుండి కొంటున్నారు ఏ కంపెనీయే టీఅర్ఎస్ నాయకులు చెప్పాలి : మున్సిపల్ బీజేపీ ప

Published: Monday July 19, 2021
కోరుట్ల, జూలై 18 (ప్రజాపాలన ప్రతినిధి) : దేశం మొత్తం మోడీ ఉచిత వ్యాక్సిన్ అందిస్తుంటే టీఅర్ఎస్ నాయకులు మాత్రం పబ్బం గడుపుకోవడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం అందిస్తున్న ఉచిత వ్యాక్సిన్ ను టీఅర్ఎస్ నాయకులు మేము ఇస్తున్నాం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నరని మున్సిపల్ బిజేపి ప్లోర్ లీడర్ మడవేని నరేష్ అన్నారు. నిజంగా టీఆర్ఎస్ నాయకులకు చిత్త శుద్ధి ఉంటే కోరుట్ల పట్టణంలో 100 పడకల దవాఖాన వాఖ్ధానం అమలు చెయ్యండనీ, గత ఏడు సంవత్సరాలు గా పెండింగ్ లో వున్న డబుల్ బెడ్ రూమ్ లు పూర్తి చేసి అర్హులకు అందిచలని, కోరుట్లలో ప్రతి వార్డులో సిమెంట్ రోడ్స్ అన్ని మట్టిరోడ్స్ గా మారాయని వెంటాన్నే రోడ్స్ మరమ్మత్తులు చేసి, ఫిల్టర్ బెడ్ పూర్తి అంగులతో పూర్తి చేసి కోరుట్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలని డిమాండ్ చేశాడు.