మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన డా.నాగుబండి.ఇంటూరి..

Published: Monday January 10, 2022
పాలేరు జనవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, జన్మదినం సందర్భంగా కూసుమంచి యం యల్ ఏ క్యాంపు ఆఫీసులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో, పైనంపల్లి  గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు  పైనంపల్లి పి ఎ సి ఎస్ చైర్మన్. ఖమ్మం డి సి యం యస్ డైరెక్టర్.డా.నాగుబండి శ్రీనివాసరావు, ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, పలువురు నాయకులు రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదల పెన్నిధి పాలేరు నియోజకవర్గ ప్రజల పాలిట దేవుడు లాంటి ఉపేందర్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో గెలవటం పాలేరు నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావించాలి అని వారు అన్నారు, అన్న అనగానే నేను ఉన్న అంటూ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి సాహసం తన స్వంత ఖర్చులతో పలు అభివృద్ధి పనులు చేయిస్తున్న మహాత్ముడు మన కందాల ఉపేందర్ రెడ్డి, అని పలువురు నాయకులు అభినందించారు. అన్నం  బ్రహ్మయ్య, మాట్లాడుతూ మన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ కందాల ఉపేందర్ రెడ్డి, జన్మదిన వేడుకలు కోలాహలంగా జరుపుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు, జిల్లా పార్టీ మహిళా నాయకురాలు బేబి స్వర్ణకుమారి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, రూరల్ మండల ఎంపీపీ బెల్లం ఉమా, నేలకొండపల్లి ఎం పి పి వజ్జా రమ్య, సి డి సి చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, నేలకొండపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శాఖమూరి సతీష్, వజ్జా శ్రీనివాస రావు,